నోయిడా ఫ్లాట్లో భార్యాభర్తల దారుణ హత్య
ABN , First Publish Date - 2020-11-05T15:37:25+05:30 IST
ఓ ఫ్లాట్ లో భార్యభర్తలు హత్యకు గురైన దారుణ ఘటన నోయిడాలో వెలుగుచూసింది....
నోయిడా : ఓ ఫ్లాట్ లో భార్యభర్తలు హత్యకు గురైన దారుణ ఘటన నోయిడాలో వెలుగుచూసింది. గ్రేటర్ నోయిడాలోని చెర్రీ కౌంటీ సొసైటీలోని 9వఅంతస్తు ఫ్లాట్ లో కిరాణా షాపు యజమాని వినయ్ గుప్తా, అతని భార్య నేహాగుప్తాల మృతదేహాలను రక్తపుమడుగులో పడి ఉండగా పోలీసులు గుర్తించారు. వినయ్ గుప్తా కిరాణా వ్యాపారి. వినయ్, నేహాగుప్తా దంపతులు కొన్ని నెలల క్రితమే ఈ ఫ్లాటుకు వచ్చారని, వారికి అక్కడ కిరాణ దుకాణం ఉందని అదనపు పోలీసు కమిషనర్ లవ్ కుమార్ చెప్పారు. దంపతుల హత్యపై తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని లవ కుమార్ చెప్పారు. హత్య జరిగిన ఫ్లాటుకు ప్రత్యేక పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ లను తీసుకువచ్చారు. ఈ జంటకు బాగా తెలిసిన వారే వచ్చి వారిని హతమార్చి పారిపోయారని, ఇంట్లో ఎలాంటి దోపిడీ జరగలేదని పోలీసులు చెప్పారు.