ఎఫ్ఐఐల వాటా ఏడాదిన్నర కనిష్టానికి...
ABN , First Publish Date - 2022-01-27T23:04:38+05:30 IST
కొంత కాలంగా... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు విక్రయాల దిశగానే వెళుతోన్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ : కొంత కాలంగా... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు విక్రయాల దిశగానే వెళుతోన్న విషయం తెలిసిందే. దేశీయ మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొద్దో గొప్పో కొనుగోళ్లు చేస్తున్నప్పటికీ... మార్కెట్లకు మాత్రం అంతగా తోడ్పాటు మాత్రం లభించడం లేదని చెబుతున్నారు. తాజా డేటా బట్టి చూస్తే.. ఆయా కంపెనీల్లో ఎఫ్ఐఐల వాటా ఏడాదిన్నర కనిష్టానికి పడిపోయింది. డిసెంబరు ఆఖరి నాటికి భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి 5 బిలియన్ డాలర్ల మొత్తాన్ని వెనక్కు తీసేసుకున్నట్టు మోతిలాల్ ఒస్వాల్ నివేదిస్తోంది.
ఇక... విదేశీ పెట్టుబడిదాదరులు... ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో స్టాక్స్ను అమ్ముకుంటూ వస్తున్నారు. సెప్టెంబరు త్రైమాసికంలో 45.2 శాతంగా ఉన్న ఎఫ్ఐఐ హోల్డింగ్స్ ఇప్పుడు 35 శాతానికి మాత్రమే పరిమితమైంది. ఇది 20 నెలల కనిష్టం. పైనాన్షియల్ సర్వీసెస్తో పాటు టెలికాం, ఐటీ, రిటైల్, సిమెంట్, ఆటోమొబైల్ మెటల్స్, ఎనర్జీ కంపెనీల్లో కూడా తమ వాటాలను విదేశీ మదుపరులు గణనీయంగా తగ్గించుకుంటూనే వస్తున్నారు.
దేశీయ ఫండ్స్ దూకుడు...
డిసెంబరు నాటికి డీఐఐల వాటా నిఫ్టీ500 కంపెనీల్లో పధ్నాలుగు శాతానికి చేరింది. డిసెంబరు త్రైమాసికంలో డీఐఐల వాటా విలువ సుమారు ఎనిమిది బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. క్నాలజీ, క్యాపిటల్ గూడ్స్, రిటైల్ రంగాల్లో స్టాక్స్ క్రయిస్తూ వస్తున్నారు.