10మంది నవజాత శిశువుల మృతి ఘటనలో ఇద్దరు నర్సులపై కేసు
ABN , First Publish Date - 2021-02-19T18:11:19+05:30 IST
మహారాష్ట్రలోని భండారా జనరల్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మరణించిన కేసులో...
భండారా (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని భండారా జనరల్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మరణించిన కేసులో ఇద్దరు నర్సులపై కేసు నమోదు చేసినట్లు మహారాష్ట్ర డీజీపీ హేమంత్ నగరాలి చెప్పారు. విధినిర్వహణలో నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లే అగ్నిప్రమాదం జరిగి 10మంది శిశువులు మరణించారని దర్యాప్తులో తేలింది. ఈ అగ్నిప్రమాద ఘటన అనంతరం నిర్లక్ష్యంగా వ్యవహరించిన భండారా జిల్లా సర్జన్ డాక్టర్ ప్రమోద్ ఖండాతిని సస్పెండ్ చేశారు. అదనపు జిల్లా సర్జన్ డాక్టర్ సునీల్ బదీని బదిలీ చేశారు. జనవరి 9వతేదీన ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటన సంచలనం రేపింది.