శ్రీశైలం వద్ద అగ్ని ప్రమాదం
ABN , First Publish Date - 2021-10-09T03:11:38+05:30 IST
శ్రీశైలం మండలంలోని సున్నిపెంటలోని రింగ పార్క వద్ద
కర్నూలు: శ్రీశైలం మండలంలోని సున్నిపెంటలోని రింగ పార్క వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్బీఎమ్ఎస్ ఆటోమొబైల్ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరుగడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో ఇంజన్ ఆయిల్స్. వాహనాల స్పేర్ పార్ట్స్ తగలబడుతున్నాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. సున్నిపెంట గ్రామంలో అంధకారం నెలకొంది. గంట నుంచి విద్యుత్ అంతరాయం ఏర్పడింది.