కరోనా పేరుతో తప్పుడు ప్రచారమా?

ABN , First Publish Date - 2021-04-11T09:21:27+05:30 IST

తనకు కరోనా వచ్చిందంటూ తప్పుడు వార్తలు ప్రసారం చేసిన సీఎం జగన్‌ సొంత మీడియా సదరు వార్తను వెనక్కి తీసుకోవాలని

కరోనా పేరుతో తప్పుడు ప్రచారమా?

జగన్‌ మీడియాపై టీడీపీ నేతల ఫైర్


అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): తనకు కరోనా వచ్చిందంటూ తప్పుడు వార్తలు ప్రసారం చేసిన సీఎం జగన్‌ సొంత మీడియా సదరు వార్తను వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి జవహర్‌ డిమాండ్‌ చేశారు. అదేవిధంగా తనకు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితకు కరోనా పాజిటివ్‌ వచ్చిందంటూ జగన్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఎమ్మెల్సీ సంధ్యారాణి మండిపడ్డారు. కాగా, తిరుపతి ఓటర్లకు లేఖలు రాయడం ఆపి, మీ ప్రభుత్వంలో దళితులకు ఏమిచ్చారో జగన్‌ లెక్క చెప్పాలని మాజీ మంత్రి జవహర్‌ డిమాండ్‌ చేశారు. ఎస్సీలకు అందాల్సిన సబ్‌ప్లాన్‌ నిధులు దేనికి ఖర్చు చేశారని శనివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. 

Updated Date - 2021-04-11T09:21:27+05:30 IST