ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్: స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్ల వాన!

ABN , First Publish Date - 2021-01-18T02:24:41+05:30 IST

రిపబ్లిక్ డేకు ముందు ఫ్లిప్‌కార్ట్ మరోమారు ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చేసింది. ఈ నెల 20 నుంచి

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్: స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్ల వాన!

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డేకు ముందు ఫ్లిప్‌కార్ట్ మరోమారు ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చేసింది. ఈ నెల 20 నుంచి ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు మాత్రం 19న అర్ధరాత్రి నుంచే సేల్ అందుబాటులోకి వస్తుంది.


సేల్‌‌లో భాగంగా బ్యాంక్ రాయితీలను అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్, స్మార్ట్ టీవీలు, వర్క్ ఫ్రమ్ హోం యాక్సెసరీలు, ఫర్నిచర్, ఫ్యాషన్ ఉత్పత్తులను అందుబాటులో ఉంచనుంది. ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’లో భాగంగా కొన్ని బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్ల ధరలు ఇలా..


రియల్‌మి 

* రియల్‌మి సీ 12 3జీబీ ర్యామ్+32 జీబీ అంతర్గత మెమొరీ ఫోన్ ధర రూ. 8,499

* రియల్‌మి 7 8జీబీ ర్యామ్, 64 ఎంపీ క్వాడ్ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్ ధర రూ. 13,999 

* రియల్‌మి 7 ప్రొ ధర రూ. 18,999 మాత్రమే. ఎస్ అమోలెడ్ డిస్‌ప్లే, 65 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటివి ఫీచర్లు ఉన్నాయి.  

* రియల్‌మి 6 ధర రూ.13,999. 90హెచ్‌జడ్ రీఫ్రెష్ రేట్, 30 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ 


ఐఫోన్ 

ఐఫోన్ 11 అసలు ధర రూ. 54,900 కాగా, సేల్ సందర్భంగా దానిని రూ. 48,999కే అందుబాటులో ఉంచింది. 

ఐఫోన్ ఎస్ఈని రూ. 27,999కే విక్రయించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డు యూజర్లకు రూ. 4 వేల రాయితీ లభిస్తుంది.

ఐఫోన్ ఎక్స్ఆర్ ధరను రూ.35,999గా పేర్కొంది. బ్యాంకు కార్డులపై డిస్కౌంట్ లభిస్తుంది.


షియోమీ

* షియోమీ ఎంఐ 10టీని రూ. 26,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే, ఎక్స్‌‌చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. 

* పోకో ఎక్స్3 ధర రూ. 14,999 మాత్రమే. స్నాప్‌డ్రాగన్ 732 చిప్‌సెట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. 

* పోకో ఎం2 ప్రొ ధర రూ. 11,999

* రెడ్‌మి 9ఐ 4జీబీ ర్యామ్ ధరను రూ. 7,999కి తగ్గించింది. 


శాంసంగ్

* శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 ధర రూ. 13,999.  ఎస్ అమోలెడ్ డిస్‌ప్లే, 64 ఎంపీ కెమెరా లెన్స్ వంటివి ఉన్నాయి. 

* శాంసంగ్ ఎస్20 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 44,999కే సొంతం చేసుకోవచ్చు. 

* శాంసంగ్ నోట్ 10 ప్లస్ ధరను రూ. 54,999కి తగ్గించింది. 


మోటొరోలా

* మోటో జి 5జీ ఫోన్‌ ధరను రూ. 18,999గా పేర్కొంది. ఈ ఫోన్‌లో సరికొత్త స్నాప్‌డ్రాగన్ 750జి చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 

* మోటొరోలా వన్ ప్లస్ ఫ్యూజన్ ప్లస్ ధరను రూ. 15,999గా పేర్కొంది. 6జీబీ ర్యామ్‌, స్నాప్‌డ్రాగన్ 730జి చిప్‌సెట్, పాప్ అప్ కెమెరా, 64 ఎంపీ ప్రైమరీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

Updated Date - 2021-01-18T02:24:41+05:30 IST