సాగర్ జలాశయానికి తగ్గిన వరద
ABN , First Publish Date - 2021-10-18T01:47:34+05:30 IST
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాలకు ఎగువనుంచి ఇన్ఫ్లో తగ్గటంతో ఆదివారం
నాగార్జునసాగర్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాలకు ఎగువనుంచి ఇన్ఫ్లో తగ్గటంతో ఆదివారం రెండు క్రస్ట్గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590అడుగులు (312.0450టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.80అడుగులు(311.4474టీఎంసీలు)గా ఉంది. సాగర్ నుంచి మొత్తం 74,283 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి 27,035 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80అడుగులుగా ఉంది. ఎగువ నుంచి శ్రీశైలానికి 56191 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.