సాగర్ జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరద
ABN , First Publish Date - 2021-08-20T01:58:28+05:30 IST
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువనుంచి వరద రాక స్వల్పంగా పెరిగింది. బుధవారం 33,549క్యూసెక్కులుగా ఉన్న
నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువనుంచి వరద రాక స్వల్పంగా పెరిగింది. బుధవారం 33,549 క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో గురువారానికి 33,923క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589 అడుగులు (309.0570టీఎంసీలు)గా ఉంది. సాగర్కు 33,923క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 47,517క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.