స్కూళ్లకు, కరోనా వ్యాప్తికి సంబంధమే లేదు
ABN , First Publish Date - 2022-01-17T22:40:58+05:30 IST
స్కూళ్లకు, కరోనా వ్యాప్తికి సంబంధమే లేదని నిబంధనలే చెబుతున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: స్కూళ్లకు, కరోనా వ్యాప్తికి సంబంధమే లేదని నిబంధనలే చెబుతున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పరిస్థితులకు అనుగుణంగా స్కూళ్ల నిర్వహిస్తున్నామని తెలిపారు. గత రెండేళ్లలో కరోనా దృష్ట్యా పరీక్షలు నిర్వహించలేదని, విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్, ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగిస్తామని ప్రకటించారు. విద్యార్థులకు 90 శాతం మేర వ్యాక్సినేషన్ పూర్తి చేశామని మంత్రి సురేష్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ పూర్తి కాలేదని స్కూళ్లను తెరవొద్దంటూ.. ప్రతిపక్షాలు కామెంట్లు చేయడం దురదృష్టకరమన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిక అనవసరమని తోచిపుచ్చారు. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు పెట్టలేకపోయినా ఏపీలో నిర్వహించామని తెలిపారు. ఆన్లైన్ బోధన ఒక లెవల్ వరకే పరిమితమని, క్లాసులకు ఫిజికల్గా వెళ్లడానికి ఆన్లైన్ బోధన ప్రత్యామ్నాయం కాదని సురేష్ వివరించారు.