ఉద్యోగం రాలేదని ఉరేసుకున్నాడు
ABN , First Publish Date - 2021-08-02T08:44:15+05:30 IST
ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
నెల్లూరులో యువకుడి బలవన్మరణం
నెల్లూరు క్రైం, ఆగస్టు 1: ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నగరంలోని నవాబుపేట చండూరివారివీధిలో కనకదుర్గారావు కుటుంబం నివాసం ఉంటోంది. ఆయనకు ఫణి, కమల్ (34) అనే కుమారులు ఉన్నారు. చిన్నకుమారుడు కమల్ ఎంబీఏ చదివి.. పదేళ్లుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా ఉద్యోగం రాలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని కమల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.