అమెరికాలో భారత మాజీ అథ్లెట్ కిరాతకం !
ABN , First Publish Date - 2020-08-27T14:36:03+05:30 IST
జంట హత్యల కేసులో భారత మాజీ షాట్పుటర్ ఇక్బాల్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు.
తల్లి, భార్యను చంపేసిన భారత మాజీ షాట్పుటర్ ఇక్బాల్ సింగ్
వాషింగ్టన్: జంట హత్యల కేసులో భారత మాజీ షాట్పుటర్ ఇక్బాల్ సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో నివసిస్తున్న ఇక్బాల్ తల్లి, భార్యను క్రూరంగా చంపడమే కాకుండా.. తనను తాను తీవ్రంగా గాయపరచుకున్నాడు. రక్తమోడుతున్న 62 ఏళ్ల ఇక్బాల్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వృద్ధురాలైన తన తల్లి నసీబ్ కౌర్, భార్య జస్పాల్ కౌర్ను గొంతు కోసి హత్య చేసినట్టు ఇక్బాల్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అయితే, హత్యలకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వారిని చంపిన అనంతరం పోలీసులకు ఫోన్ చేయాలని సింగ్.. స్వయంగా తన కుమారుడికి చెప్పాడట..! 1983లో కువైట్లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షి్పలో ఇక్బాల్ కాంస్యం సాధించాడు. 1988లో ఢిల్లీలో జరిగిన పర్మిట్ మీట్లో స్వర్ణం నెగ్గాడు. టాటా స్టీల్, పంజాబ్ పోలీ్సలో ఇన్స్పెక్టర్గా పని చేశాడు.