మాజీ ఎంపీ మాగంటి తనయుడు రాంజీ కన్నుమూత

ABN , First Publish Date - 2021-03-08T09:43:09+05:30 IST

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) పెద్ద కుమారుడు

మాజీ ఎంపీ మాగంటి తనయుడు రాంజీ కన్నుమూత

ఏలూరు టూ టౌన్‌, మార్చి 7 : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) పెద్ద కుమారుడు రాంజీ(36) అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నెల మూడో తేదీ నుంచి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం రాత్రి మృతి చెందారు. 


 లోకేశ్‌ దిగ్ర్భాంతి

అమరావతి: మాగంటి రాంజీ మరణం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణం పార్టీకి  తీరని లోటని  ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2021-03-08T09:43:09+05:30 IST