గండిమడుగులో మునిగి నలుగురు మృతి
ABN , First Publish Date - 2021-08-08T00:31:03+05:30 IST
జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గాలివీడు మండలం వెలిగల్లులో
కడప: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గాలివీడు మండలం వెలిగల్లులో విషాదం జరిగింది. గండిమడుగులో మునిగి నలుగురు మృతి చెందారు. మృతదేహాలను పోలీసులు వెలికితీస్తున్నారు. విహారయాత్ర కోసం యువకులు వచ్చారు. మృతులను తాజ్ మహమ్మద్, ముహమ్మద్ హాంజ, ఉస్మాన్ ఖాన్, మహమ్మద్ హాఫిజ్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.