ఉచిత బియ్యం ఘనత కేసీఆర్దే: పోచారం
ABN , First Publish Date - 2020-04-09T09:38:23+05:30 IST
లాక్డౌన్ను ప్రకటించగానే దేశంలో తొలుత స్పందించి, ప్రతీ కుటుంబానికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివా్సరెడ్డి అన్నారు
బాన్సువాడ, ఏప్రిల్ 8: లాక్డౌన్ను ప్రకటించగానే దేశంలో తొలుత స్పందించి, ప్రతీ కుటుంబానికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివా్సరెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. లాక్డౌన్ నేపఽథ్యంలో ఎవరూ ఆకలితో అలమటించొద్దన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఉచిత బియ్యాన్ని ఇస్తున్నారన్నారు.