ఢిల్లీ మెట్రోలో ఉచితంగా వైఫై

ABN , First Publish Date - 2021-10-23T05:30:00+05:30 IST

ఢిల్లీ మెట్రో తమ ప్రయాణికులకు ఎల్లోలైన్‌లో ఉచితంగా వైఫైని అందిస్తోంది. ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లైన్‌లో ఉన్న ఆరు స్టేషన్ల పరిధిలో ఈ సదుపాయం ...

ఢిల్లీ మెట్రోలో ఉచితంగా వైఫై

ఢిల్లీ మెట్రో తమ ప్రయాణికులకు ఎల్లోలైన్‌లో ఉచితంగా వైఫైని అందిస్తోంది. ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లైన్‌లో ఉన్న ఆరు స్టేషన్ల పరిధిలో ఈ సదుపాయం లభిస్తుంది. ఇంటర్నెట్‌తో లభించే సమస్త సౌకర్యాలను దీంతో పొందవచ్చు. దీనికోసం  టెక్నాలజీ కన్సార్టియంతో కలిసి ఢిల్లీ మెట్రో పని చేస్తోంది. ఈ సదుపాయం కోసం ఇప్పటికే 330 వైఫై యాక్సెస్‌ పాయింట్లను ఏర్పాటు చేశారు. నెట్‌వర్క్‌కు లాగాన్‌ కాగానే, ఓటీపీ నంబర్‌ వస్తుంది. దాంతో అనుసంధానమైతే చాలు, ఉచితంగా వైఫై లభిస్తుంది. కొత్తగా కల్పించిన 22.7 కి.మీ పరిధిలోని ఆరు స్టేషన్లలో రోజూ యాభై వేలకు మించి ప్రయాణిస్తున్నట్టు ఈ ఆగస్టు మొదట్లోని గణాంకాలు తేటతెల్లం    చేస్తున్నాయి.  ఇంతకు మునుపే నాలుగు మేజర్‌ స్టేషన్లలో ఈ సదుపాయం ఉంది. 

Updated Date - 2021-10-23T05:30:00+05:30 IST