క్రీడలతో మానసికోల్లాసం

ABN , First Publish Date - 2021-04-17T05:03:44+05:30 IST

క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని కార్మిక, ఉపాధి కల్పనశాఖ

క్రీడలతో మానసికోల్లాసం
యాడారంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి మల్లారెడ్డి

  • కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి


శామీర్‌పేట : క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం శామీర్‌పేట మండలం యాడారం గ్రామంలోని ఇంగ్లీష్‌ విల్లో క్రికెట్‌ గ్రౌండ్‌లో మూడురోజులపాటు జరిగే సీఎమ్మార్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను మంత్రి ప్రారం భించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యానికి, స్నేహ సంబంధాలకు దోహదపడతా యన్నారు. యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ టోర్నమెంట్‌లో  శామీర్‌ పేట, మూడుచింతలపల్లి మండలాల నుంచి యువకులు పాల్గొంటారని వివరిం చారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మేడ్చల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జహంగీర్‌, జడ్పీటీసీ అనిత, ఎంపీపీ ఎల్లూబాయిబాబు, సర్పం చులు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-04-17T05:03:44+05:30 IST