భళా.. మీ క్రీడాస్ఫూర్తి!

ABN , First Publish Date - 2021-10-26T08:14:46+05:30 IST

భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే మ్యాచ్‌ కాదు. అది ఓ సమరమే. ఈ పోరులో గెలిచిన జట్టుకు యుద్ధంలో విజయం....

భళా.. మీ క్రీడాస్ఫూర్తి!

డుబాయ్‌: భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే మ్యాచ్‌ కాదు. అది ఓ సమరమే. ఈ పోరులో గెలిచిన జట్టుకు యుద్ధంలో విజయం సాధించినంత ఆనందం. ఇక మ్యాచ్‌ అనంతరం రెండు జట్లు చేయి కలపడం ఆటలో భాగం. కానీ ఆదివారం నాటి పోరు తర్వాత కెప్టెన్‌ కోహ్లీ, మెంటార్‌ ధోనీ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పోటీ ముగిశాక పాకిస్థాన్‌ ఓపెనర్లు బాబర్‌ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌తో విరాట్‌ ప్రత్యేకంగా ముచ్చటించాడు. రిజ్వాన్‌ భుజం తట్టాడు. ఇక ధోనీ అయితే కొందరు పాక్‌ క్రికెటర్లతో సుదీర్ఘంగా మాట్లాడుతూ కనిపించాడు. ప్రస్తుతం భారత్‌-పాకిస్థాన్‌ దేశాల నడుమ కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కోహ్లీ, మహీ అద్భుత క్రీడా స్ఫూర్తి ప్రదర్శించారంటూ సోషల్‌మీడియాలో వారిని కొనియాడుతున్నారు. 

Updated Date - 2021-10-26T08:14:46+05:30 IST