బ్యాంక్‌ అధికారులమంటూ మోసాలకు పాల్పడిన ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2021-11-17T14:32:59+05:30 IST

ఢిల్లీలో ఓ కాల్‌ సెంటర్‌పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్‌ పోలీసులు దాడి నిర్వహించి.. 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బ్యాంక్‌ అధికారులమంటూ మోసాలకు పాల్పడిన ముఠా అరెస్ట్

సైబరాబాద్ : ఢిల్లీలో ఓ కాల్‌ సెంటర్‌పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్‌ పోలీసులు దాడి నిర్వహించి.. 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్‌ సెంటర్‌లోని 23 మందిలో 16 మందిని అరెస్ట్‌ చేశారు. ఏడుగురు పరారయ్యారు. బ్యాంక్‌ అధికారులమంటూ మోసాలకు పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పలువురి ఖాతాల నుంచి సైబర్‌ నేరగాళ్లు రూ.3 కోట్లు కాజేశారు. పలు ఫిర్యాదుల మేరకు ఢిల్లీ వెళ్లి ప్రత్యేక బృందం ముఠాను పట్టుకున్నారు. ఢిల్లీ పోలీసుల సాయంతో ముఠాను అరెస్ట్‌ చేసిన సైబర్‌ క్రైమ్‌ నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మధ్యాహ్నం మీడియా ముందుకు రానున్నారు.


Updated Date - 2021-11-17T14:32:59+05:30 IST