భద్రాచలంలో 200 కేజీల గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2021-06-08T04:41:11+05:30 IST
భద్రాచలంలో సోమవారం ఒడిశా నుంచి నల్లగొండ జిల్లా మిర్యాలగూ డకు తరలిస్తున్న రూ.30 లక్షల విలువైన 200 కేజీల గంజాయిని భద్రాచలం పోలీసులు ప ట్టుకున్నారు.
భద్రాచలం, జూన్ 7: భద్రాచలంలో సోమవారం ఒడిశా నుంచి నల్లగొండ జిల్లా మిర్యాలగూ డకు తరలిస్తున్న రూ.30 లక్షల విలువైన 200 కేజీల గంజాయిని భద్రాచలం పోలీసులు ప ట్టుకున్నారు. ఏఎస్పీ డాక్టర్ జి. వినీత్ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం సీఐ టి.స్వామి, ఎస్ఐ ఎం.సిల్వారాజు కూనవరం రోడ్డులోని చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో ఇద్దరు వ్యక్తులకు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో వారి వాహనాన్ని తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. కారులో మొత్తం 200 కేజీల గంజాయి లభించింది. దీని విలు వ రూ.30 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితులను విచారించి వారు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం నందిపాడుకు చెందిన రూపావత్ రవి, దరావత్ శంకర్గా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్పీ వినీత్ మాట్లాడుతూ భద్రాచలం పట్టణ సరిహద్దుల్లో 24 గంటలు పోలీసుల తనిఖీలు జరుగుతుంటాయని, నిషేధిత వస్తువులైను తరలిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పట్టణ సీఐ టి.స్వామి, ఏఎస్ఐ శేషగిరి పాల్గొన్నారు.