హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటికి జీహెచ్ఎంసీ నోటీసులు
ABN , First Publish Date - 2021-07-16T23:08:59+05:30 IST
హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటికి జీహెచ్ఎంసీ నోటీసులిచ్చింది. మాదన్నపేట మార్కెట్ను బంద్ చేస్తామని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.
హైదరాబాద్: హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటికి జీహెచ్ఎంసీ నోటీసులిచ్చింది. మాదన్నపేట మార్కెట్ను బంద్ చేస్తామని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. మాదన్నపేట కూరగాయల మార్కెట్లో పారిశ్యుద్ధ నిర్వహణ సక్రమంగా లేదని, చెత్త తరలింపుపై నిర్లక్ష్యం వహిస్తున్నారని నోటీసుల్లో పేర్కొంది. వర్షం కురిసినప్పుడు వరద నీరు మార్కెట్లో నిలిచిపోతోందని, సర్కిల్-7 డిప్యూటీ కమిషనర్ అలివేలు మంగతాయారు నోటీసులో పేర్కొన్నారు.