యువత క్రీడల్లో రాణించాలి
ABN , First Publish Date - 2021-01-17T04:47:21+05:30 IST
యువత క్రీడల్లో రాణించాలి
కడ్తాల్ : యువత క్రీడల్లో రాణించాలని ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి, రావిచెడ్ ఎంపీటీసీ బొప్పిడి గోపాల్ అన్నారు. రావిచెడ్ గ్రామంలో మూడు రోజుల పాటు నిర్వహించిన మండలస్థాయి క్రికెట్ టోర్నమెంట్ శనివారం ముగిసింది. పోటీల్లో మహేష్, సురేష్ టీంకు మొదటి బహుమతి కింద రూ.5 వేలు గోపాల్ సమకూర్చి అందచేశారు. రెండవ బహుమతి మహేష్, భూపతి టీంలకు రూ.2వేలు శశికాంత్ అందచేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విఠలయ్యగౌడ్, రమే్షయాదవ్, పవన్, మల్లేష్, సాయికుమార్, శ్రావణ్, క్రీడాకారులు పాల్గొన్నారు.