ఫారెస్ట్ అధికారులను చెట్టుకు కట్టేసి దాడి

ABN , First Publish Date - 2021-04-13T00:23:54+05:30 IST

ఫారెస్ట్ అధికారులను చెట్టుకు కట్టేసి దాడి

ఫారెస్ట్ అధికారులను చెట్టుకు కట్టేసి దాడి

భద్రాద్రి కొత్తగూడెం: తమ పోడు భూములు ఆక్రమించుకునేందుకు వచ్చిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లను చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడ్డారు. పోడు భూముల స్వాధీనానికి వెళ్లడంతో ఘటన చోటుచేసుకుంది. అటవీ భూములను స్వాధీనం చేసుకోవడానికి వెళ్లిన అధికారులను చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు వారిపై దాడికి పాల్పడ్డారు. దుమ్ముగూడెం మండలంలోని ఢీ కొత్తూరు బీట్ పరిధిలోని చింతగుప్ప గ్రామంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్న భూములను స్వాధీనం చేసుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లారు. భూములను వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు ఆదేశించడంతో గిరిజనులు దాడి చేశారు. తమ పోడు భూమిలోకి ఎలా వస్తారని నిలదీస్తూ బీట్ ఆపీసర్లను చుట్టుముట్టారు. మహిళలంతా ఏకమై అధికారులను చెట్టుకు కట్టేసి దాడి చేశారు.



Updated Date - 2021-04-13T00:23:54+05:30 IST