ఘనంగా ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ వేడుకలు
ABN , First Publish Date - 2020-08-13T10:08:18+05:30 IST
అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) 85వ ఆవిర్భావ వేడుకలను బుధవారం కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు.
కొత్తగూడెం సంక్షేమం, ఆగస్టు 12 : అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) 85వ ఆవిర్భావ వేడుకలను బుధవారం కొత్తగూడెంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయం ఎదుట శ్వేత అరుణ పతాకాన్ని జిల్లా కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్ ఆవిష్కరించారు. అనంతరం రాహూల్ మాట్లాడుతూ.... దేశ స్వాతంత్య్రం కోసం, దేశ వ్యాప్తంగా విద్యార్థులను సంఘటితం చేసేందుకు 1986 ఆగస్టు 12న లక్నవ్లో బెనారస్ విశ్వ విద్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే. ఫహీంఖాన్, జీషాన్, ఆసిఫ్, నాగరాజు, దుర్గ ప్రసాద్, అమాన్, రవితేజ, రణధీర్, శివ పాల్గొన్నారు.