ఢిల్లీ రైల్వే స్టేషన్ నవీకరణపై జీఎంఆర్ ఆసక్తి
ABN , First Publish Date - 2020-09-19T05:48:46+05:30 IST
ఢిల్లీ రైల్వే స్టేషన్ నవీకరణకు జీఎంఆర్ గ్రూప్ ఆసక్తి చూపుతోంది. ఇది దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి రోజుకు 4.5 లక్షల
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఢిల్లీ రైల్వే స్టేషన్ నవీకరణకు జీఎంఆర్ గ్రూప్ ఆసక్తి చూపుతోంది. ఇది దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి రోజుకు 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు నిర్వహిస్తున్నారు.
దాదాపు రూ.6,500 కోట్లతో ఢిల్లీ రైల్వే స్టేషన్ను రైల్వే ల్యాండ్ డెవల్పమెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ) నవీకరించాలని భావిస్తోంది. ఆర్ఎల్డీఏ నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశంలో జీఎంఆర్, అదానీలతోపాటు దాదాపు 20 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. నవీకరణ ద్వారా ఢిల్లీ రైల్వే స్టేషన్ను మల్టీ మోడల్ హబ్గా మార్చాలని ఆర్ఎల్డీఏ యోచిస్తోంది.