జీవో 225 రద్దు చేయాలి: సయ్యద్ రఫీ
ABN , First Publish Date - 2022-01-24T09:03:04+05:30 IST
‘‘పేదలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, కట్టుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో తెచ్చింది.
అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ‘‘పేదలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, కట్టుకున్న ఇళ్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో తెచ్చింది. ఆ జీవో 225 పేదలకు వ్యతిరేకమైనది. దానిని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి’’ అని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ డిమాండ్ చేశారు. ఓటీఎస్ పథకం మాదిరిగా పేదల నుంచి రూ.3,500 కోట్లు దండుకోవటానికి జగన్రెడ్డి ఈ జీవోను తెచ్చారని విమర్శించారు. ఆదివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.