హంసవాహనంపై ఆదిదేవుడు

ABN , First Publish Date - 2021-03-07T08:53:45+05:30 IST

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడోరోజు శనివారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు.

హంసవాహనంపై ఆదిదేవుడు

శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పట్టువస్ర్తాలు

శ్రీశైలం, మార్చి 6: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడోరోజు శనివారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. ముందుగా అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేక అలంకృతులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో ముస్తాబైన హంస వాహనంపై అదిష్ఠింపజేశారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజాదికాలు, హారతులు ఇచ్చారు. అనంతరం ఆలయం నుంచి వెలుపలకి తోడ్కొనివచ్చి గ్రామోత్సవం జరిపారు. సాయంత్రం విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం తరపున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఆదివారం స్వామివారికి మయూర వాహనసేవ, గ్రామోత్సవం నిర్వహిస్తారు.  

Updated Date - 2021-03-07T08:53:45+05:30 IST