జాతీయ అథ్లెటిక్స్‌లో రజితకు స్వర్ణం

ABN , First Publish Date - 2021-10-13T06:39:30+05:30 IST

జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగమ్మాయి కె.రజిత పసిడి పతకం కైవసం చేసుకొంది.

జాతీయ అథ్లెటిక్స్‌లో రజితకు స్వర్ణం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి కె.రజిత పసిడి పతకం కైవసం చేసుకొంది. బాలికల అండర్‌-20 విభాగంలో జరిగిన 400 మీటర్ల పరుగులో రజిత 56.19 సెకన్లలో రేసును పూర్తి చేసి ప్రథమ స్థానాన్ని దక్కించుకొంది. పంజాబ్‌కు చెందిన కిరణ్‌జ్యోత్‌ కౌర్‌ (57.02 సె.) 2వ, కేరళ అథ్లెట్‌ ప్రిస్కిల్లా డేనియల్‌ (57.54 సె.) 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. తూర్పు గోదావరికి చెందిన రజిత ఏడాదిన్నరగా అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ కోచ్‌ ఎన్‌. రమేష్‌ వద్ద శిక్షణ తీసుకుంటోంది. గోపీచంద్‌-మైత్రాహ్‌ ఫౌండేషన్‌ రజిత శిక్షణకు అవసరమైన సదుపాయాలను అందిస్తోంది.

Updated Date - 2021-10-13T06:39:30+05:30 IST