గొట్టిపాటిని టార్గెట్ చేసిన వైసీపీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-01-27T21:12:20+05:30 IST
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ నేతల కట్టడికి ప్రభుత్వం శ్రీకారం పలికింది.
అమరావతి: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ నేతల కట్టడికి ప్రభుత్వం శ్రీకారం పలికింది. అందుకోసం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ను టార్గెట్ చేసింది. ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీసే విధంగా ఇప్పటికే ఆయన ప్రధాన క్వారీలను మూసివేయించిన ప్రభుత్వం ఆయన గ్రానైట్ ఫ్యాక్టరీలపై చర్యలకు ఉపక్రమించింది. ఇటు స్థానిక ఎన్నికలు.. అటు హైకోర్టులో రవికుమార్కు అనుకూల తీర్పులు వెలువడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయన పరిశ్రమలను కూడా మూసివేయించేందుకు రంగంలోకి రావడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది.
ఏపీలో టీడీపీని బలహీనపరిచేందుకు ప్రభుత్వం ఇవన్నీ చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలోని ముఖ్య నేతలను తమవైపు లాక్కునే ప్రయత్నాలకు శ్రీకారం పలికిన విషయం తెలిసిందే. అందుకు ఎక్కువ మంది లొంగిపోవడంతో వివిధ రూపాల్లో ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నాలను ప్రభుత్వం ప్రారంభించింది.