కోవిడ్ కట్టడి కోసం తెలంగాణలో వార్ రూమ్: గవర్నర్ తమిళి సై సౌందర రాజన్

ABN , First Publish Date - 2021-08-13T02:41:10+05:30 IST

కోవిడ్‌ను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా వార్ రూమ్‌ను ఏర్పాటు చేసిందని రాష్ట్ర గవర్నర్ తమిళి

కోవిడ్ కట్టడి కోసం తెలంగాణలో వార్ రూమ్: గవర్నర్ తమిళి సై సౌందర రాజన్

ఢిల్లీ: కోవిడ్‌ను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా వార్ రూమ్‌ను ఏర్పాటు చేసిందని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. ప్రధాని మోదీతో తెలంగాణ గవర్నర్ తమిళిసై భేటీ అయ్యారు. రాష్టంలోని తాజా పరిస్థితులను మోదీకి తమిళిసై వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కోవిద్ ఎదుర్కోవడంలో సమర్థంగా పని చేసిందని గవర్నర్ కొనియడారు. కోవిడ్ విపత్కర సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రాలకు అన్ని విధాలుగా సహకారం అందిందన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రం సమర్థవంతంగా అన్ని చర్యలు తీసుకుందన్నారు. సలహాలు, మందుల సరఫరా, ఆక్సిజన్ సరఫరా అన్ని విషయాలలో కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు సహాయ సహకారాలు అందించిందన్నారు. కొవిడ్ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలను వివరిస్తూ రాసిన పుస్తకాన్ని స్వయంగా ప్రధానికి అందజేశానని గవర్నర్ తెలిపారు.  వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా రాష్ట్రప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నారు.


కోవిడ్‌ను అరికట్టడానికి హైటెక్ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఉపయోగించుకుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానాన్ని, అనుభవాన్ని పుదుచ్చేరిలో ఉపయోగించుకున్నామని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణ, పుదుచ్చేరి మధ్య మంచి అభినావ అనుబంధాన్ని ఏర్పడటానికి ఈ కార్యక్రమం తోడ్పడిందన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల పూర్వ విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నామని గవర్నర్ తెలిపారు. తాము చదువుకున్న యూనివర్సిటీలకు పూర్వ విద్యార్థులు ఏదో రూపకంగా సహాయ సహకారాలు అందించాలనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్రంలోని గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందులో భాగంగానే ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. 

Updated Date - 2021-08-13T02:41:10+05:30 IST