వ్యాక్సిన్ వచ్చినా కోవిడ్ నిబంధనలు పాటించాలి: గవర్నర్ తమిళిసై

ABN , First Publish Date - 2021-01-16T19:25:48+05:30 IST

హైదరాబాద్‌: నిమ్స్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని గవర్నర్ తమిళిసై పరిశీలించారు. ప్రధాని చెప్పినట్లు స్వయం సమృద్ధ

వ్యాక్సిన్ వచ్చినా కోవిడ్ నిబంధనలు పాటించాలి: గవర్నర్ తమిళిసై

హైదరాబాద్‌: నిమ్స్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని గవర్నర్ తమిళిసై పరిశీలించారు. ప్రధాని చెప్పినట్లు స్వయం సమృద్ధ భారత్‌ను చూస్తున్నామన్నారు. ఈ వ్యాక్సిన్ ఎండింగ్ ఆఫ్ కోవిడ్ అని తెలిపారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చి వ్యాక్సిన్ పరిశోధనలను ప్రోత్సహించారని గవర్నర్ పేర్కొన్నారు. ఏ దేశంపై ఆధారపడాల్సిన అవసరం భారత్‌కు లేదన్నారు. వ్యాక్సిన్ వచ్చినా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. 140 కేంద్రాల్లో 30 మందికి చొప్పున వ్యాక్సిన్ ఇవ్వబడుతుందన్నారు. సోమవారం నుంచి వ్యాక్సిన్ కేంద్రాలు పెరుగుతాయని వెల్లడించారు. వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని.. హెల్త్ వర్కర్స్ కూడా అపోహతో ఉన్నారన్నారు. వ్యాక్సిన్ సురక్షితమని.. ఎలాంటి ప్రమాదమూ ఉండబోదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-16T19:25:48+05:30 IST