కరోనాను మించిన దారుణ ప్రమాదం ఇదే..!

ABN , First Publish Date - 2020-04-02T23:17:46+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రులు కోవిడ్ సెంటర్లుగా మార్చడంతో సాధారణ అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రధానంగా..

కరోనాను మించిన దారుణ ప్రమాదం ఇదే..!

నెల్లూరు: ప్రభుత్వ ఆస్పత్రులు కోవిడ్ సెంటర్లుగా మార్చడంతో సాధారణ అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రధానంగా డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు వంటి ప్రాంతాల్లో డయాలసిస్ నిలిపివేయడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారి డయాలసిస్ జరగకున్నా ప్రాణాలకే ముప్పు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు డయాలసిస్ రోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. 


నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలోని డయాలసిస్ విభాగంలో ప్రతి రోజూ 60 మందికి డయాలసిస్ జరుగుతూనే ఉంటుంది. వారంలో రోజుల్లో సుమారు 300 మందికి పైగా రోగులు డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు. ఒక్కో రోగి వారంలో మూడుసార్లు డయాలసిస్ చేయించే పరిస్థితులు ఉన్నాయి. కరోనా కారణంగా ఆస్పత్రిలోని కోవిడ్ రీజియన్ సెంటర్‌గా మార్చేశారు. సాధారణ అత్యవసర వైద్య సేవలను నిలిపివేశారు. దాంతో డయాలసిస్ విభాగం కూడా ఆగిపోయింది. జిల్లాలోని సుదూర ప్రాంతాంలకు చెందిన పేద నిరుపేద రోగులే వస్తూ ఉంటారు. ప్రస్తుతం వాహనాలు లేకపోవడంతో ఆఖరికి రూ.1500ల నుంచి రూ.3000 బాడుగ చెల్లించి నెల్లూరుకు చేరుకుంటున్నారు. 


Updated Date - 2020-04-02T23:17:46+05:30 IST