ఏపీ ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

ABN , First Publish Date - 2020-08-10T18:22:35+05:30 IST

ఆగస్టు 11 న శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు తన హృదయపూర్వక

ఏపీ ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

అమరావతి: ఆగస్టు 11న శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.  భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు భోదించిన సందేశాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ గుర్తుచేస్తుందని గవర్నర్ ఒక సందేశంలో చెప్పారు. సామరస్యపూర్వక సమాజాన్ని నిర్మించడానికి శ్రీకృష్ణ జన్మాష్టమి ఒక పునాదని... సమాజంలో శాంతి, స్నేహం, సోదరభావం, ప్రజా శ్రేయస్సు నెలకొల్పేందుకు ఈ శుభదినం ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ బిశ్వభూషణ్ ఆకాంక్షించారు. 

Updated Date - 2020-08-10T18:22:35+05:30 IST