ఏపీలో గ్రామ పంచాయతీ పోరు
ABN , First Publish Date - 2021-11-14T02:32:56+05:30 IST
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పోరు ఆదివారం
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ పోరు ఆదివారం జరుగనుంది. 36 సర్పంచ్, 68 పంచాయతీ వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతాయి. 15న సోమవారం నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. మున్సిపాలిటీల్లో 365 వార్డులకు ఎన్నికలను నిర్వహిస్తారు. ఈ నెల 16న జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తారు. 10 జడ్పీటీసీలు, 163 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగుతాయని అధికారులు తెలిపారు.
ఏపీ మినీ పల్లె పోరుకు సిద్ధమైంది. ఆదివారం మిగిలిపోయిన గ్రామ పంచాయితీలకు ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల సన్నాహకాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నీలం సాహ్ని సమీక్ష నిర్వహించారు. మొత్తం 69 స్ధానాల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే 30 స్ధానాలు ఏకగ్రీవం అయ్యాయి. 36 పంచాయితీల్లో ఆదివారం సర్పంచ్ స్ధానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.