నేడు ఏపీలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం
ABN , First Publish Date - 2021-05-05T15:52:09+05:30 IST
అమరావతి: నేడు ఏపీలో గ్రూప్ అఫ్ మినిస్టర్స్ సమావేశం జరగనుంది. మంగళగిరి ఏపీఐఐసీ బిల్డింగ్ 6వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు
అమరావతి: నేడు ఏపీలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరగనుంది. మంగళగిరి ఏపీఐఐసీ బిల్డింగ్ 6వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మంత్రులు కమిటీ కన్వీనర్ ఆళ్ల నాని అధ్యక్షతన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరగనుంది. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ వేగవంతం, హాస్పిటల్స్లో బెడ్స్, ఆక్సిజన్, రెమిడీసివర్ ఇంజక్షన్స్, పలు అంశాలపై కీలకంగా చర్చ జరగనుంది. మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, సిదిరి అప్పలరాజు పాల్గొననున్నారు. ఏపీ డీజీపీ, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, పలువురు ఇతర శాఖల అధికారులు పాల్గొంటారు. ఏపీఐఐసీ 12వ ఫ్లోర్లో మీడియా సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని బ్రీఫ్ చేయనున్నారు.