జీఎస్‌టీ రిటర్న్‌ ఫైలింగ్‌ గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-03-24T09:58:25+05:30 IST

కరోనా వైర్‌సను దృష్టిలో ఉంచుకుని వివిధ జీఎ స్‌టీ రిటర్నుల ఫైలింగ్‌ గడువును ప్రభుత్వం...

జీఎస్‌టీ రిటర్న్‌ ఫైలింగ్‌ గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: కరోనా వైర్‌సను దృష్టిలో ఉంచుకుని వివిధ జీఎ స్‌టీ రిటర్నుల ఫైలింగ్‌ గడువును ప్రభుత్వం పొడిగించింది.  2020 ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్‌-38 రిటర్న్‌ ఫైలింగ్‌ను ఏప్రిల్‌ 7 వరకు దాఖలు చేసే వెసులుబాటు కల్పించింది. ఈ నెలాఖరులోగా ఫారం జీఎ్‌సటీఆర్‌-9లో ఫైల్‌ చేయాల్సిన యాన్యువల్‌ రిటర్న్‌, రీకాన్సిలియేషన్‌ స్టేట్‌మెంట్ల గడువును జూన్‌ 30 వరకు పొడిగించారు. కాంపోజిషన్‌ పథ కం ఎంచుకునే గడువును ఈ నెలాఖరు నుంచి ఏప్రిల్‌ 7 వరకు పొడిగించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Updated Date - 2020-03-24T09:58:25+05:30 IST