జీఎస్టీ... రూ. లక్ష కోట్ల ఆదాయం
ABN , First Publish Date - 2021-08-01T20:01:47+05:30 IST
జీఎస్టీ రూపేణా ప్రభుత్వానికి రూ. లక్ష కోట్ల ఆదాయం సమకూరింది.
న్యూఢిల్లీ : జీఎస్టీ రూపేణా ప్రభుత్వానికి రూ. లక్ష కోట్ల ఆదాయం సమకూరింది. జులై 2021 లో మొత్తం రూ. 1,16,393 కోట్లు వసూలైంది. కోవిడ్ సెకండ్, ధర్డ్ వేవ్ ఆందోళన మధ్య కూడా భారీగా ఆదాయం సమకూరడం గమనార్హం. కాగా 2021-22 తొలి త్రైమాసికంలో ఎర్నింగ్స్ డేస్ కారణంగా వసూళ్లు పెరిగినట్లు చెబుతున్నారు. అయితే గతేడాది ఇదే నెలతో పోల్చుకుంటే జీఎస్టీ ఆదాయం 33 శాతానికి పైగా పెరిగింది.