ఏపీలో పాకిస్థాన్ వివాదం ఎందుకొచ్చింది?

ABN , First Publish Date - 2021-12-31T01:22:34+05:30 IST

గుంటూరులోని జిన్నా టవర్ అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. జిన్నా టవర్ పేరు మార్చాలని ...

ఏపీలో పాకిస్థాన్ వివాదం ఎందుకొచ్చింది?

అమరావతి: గుంటూరులోని జిన్నా టవర్ అంశం రాజకీయంగా దుమారం రేపుతోంది. జిన్నా టవర్ పేరు మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పాకిస్థాన్‌లో ఉండాల్సిన పేరు ఇక్కడ ఎంతుకని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే స్వాతంత్య ఉద్యమంలో పాల్గొన్న మహ్మద్ అలీ  జిన్నా పేరును టవర్‌కు అప్పట్లో పెడితే ఇప్పుడు మార్చడమేంటని మిగిలిన పార్టీలు అంటున్నాయి. విజయవాడలో జరిగిన బీజేపీ సభలో తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ రేటు తగ్గాస్తామని సోము వీర్రాజు చెప్పడంపై ప్రజలు, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ డ్యామేజీని డైవర్షన్ చేయడానికే బీజేపీ నేతలు జిన్నా టవర్ అంశాన్ని తీసుకొచ్చారని ఆరోపిస్తున్నాయి.     


ఈ నేపథ్యంలో ‘‘ఏపీలో పాకిస్థాన్ వివాదం ఎందుకొచ్చింది. గుంటూరు జిన్నా టవర్ పేరుపై గొడవేంటి?. జిన్నా టవర్ పేరుపై బీజేపీ ఎందుకు ఫోకస్ పెట్టింది?. సోము వీర్రాజు చేసిన డ్యామేజీ నుంచి డైవర్షనా?. ఏపీ అగ్రెసివ్ హిందూత్వ క్యాంపెయిన్‌లో భాగమా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహిహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Updated Date - 2021-12-31T01:22:34+05:30 IST