దిశా పోలీస్ స్టేషన్ ఎదుట దారుణం.. బాధితురాలిపై సీఐ దాడి
ABN , First Publish Date - 2020-08-08T01:58:49+05:30 IST
మహిళ కోసం ప్రత్యేకంగా దిశా పోలీస్స్టేషన్లను ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. ఈ పోలీస్స్టేషన్లో బాధిత మహిళలలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.
గుంటూరు: ‘దిశ’ హత్య తర్వాత మహిళలకు రక్షణగా ఉంటామని ప్రభుత్వాలు ప్రతినబూనాయి. అంతేకాదు ఏపీ ఏకంగా దిశ చట్టాన్ని తెచ్చింది. చట్టం తెచ్చి ప్రభుత్వం సరిపెట్టుకోలేదు. మహిళ కోసం ప్రత్యేకంగా దిశా పోలీస్స్టేషన్లను ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. ఈ పోలీస్స్టేషన్లో బాధిత మహిళలలు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేషన్లోనే అవమానం జరిగితే బాధితులు ఎవరికి మొరపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకే విషయాన్ని చెప్పాలి. ఓ సీఐ ఏకంగా దిశా పోలీస్స్టేషన్ సాక్షిగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘోరానికి దిశా పోలీస్స్టేషన్ సాక్ష్యంగా నిలిచింది. ఇక అసలు విషయంలోకి వస్తాను. గుంటూరు దిశా పోలీస్ స్టేషన్ ఎదుట దారుణం జరిగింది. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన మైనార్టీ యువతిపై స్టేషన్ ఎదుటే సీఐ దాడికి పాల్పడ్డాడు. సీఐ సోదరుడిపై వివాహిత ఫిర్యాదు చేయడానికి వచ్చింది. బాధిత వివాహితతో పాటు వెంట వచ్చిన సోదరిపై కూడా సీఐ దాడి చేశాడు. ఇంటికి వెళ్లేలోపు నీ జీవితం నాశనం అయ్యేలా కేసుల్లో ఇరికిస్తానని సీఐ బెదిరింపులకు తెగబడ్డాడు. సీఐపై దిశా స్టేషన్లో బాధిత యువతి ఫిర్యాదు చేసింది.