గుంటూరులో ఆగివున్న కూలీల ట్రాక్టర్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ABN , First Publish Date - 2021-03-01T16:13:46+05:30 IST
జిల్లాలో మేడికోండూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న కూలీల ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి..
గుంటూరు: జిల్లాలో మేడికోండూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న కూలీల ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైనవారిని స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కొర్రపాడు దగ్గర చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.