విజయసాయి వసూళ్లు 400 కోట్లు : బండారు

ABN , First Publish Date - 2021-03-08T10:18:49+05:30 IST

‘‘జీవీఎంసీ ఎన్నికల కోసం రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి నగరంలో వ్యాపారులను బెదిరించి రూ.400 కోట్లు వసూలు చేశారు.

విజయసాయి వసూళ్లు 400 కోట్లు : బండారు

విశాఖపట్నం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ‘‘జీవీఎంసీ ఎన్నికల కోసం రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నేత విజయసాయిరెడ్డి నగరంలో వ్యాపారులను బెదిరించి రూ.400 కోట్లు వసూలు చేశారు. గత వారం పది రోజుల్లో పారిశ్రామికవేత్తలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు... ఒక్కొక్కరి నుంచి రూ.5 నుంచి రూ.10 కోట్లు వసూలు చేశారు. ఆ డబ్బుల్లో రూ.100 కోట్ల వరకు జీవీఎంసీ ఎన్నికల్లో వెచ్చించి, మిగిలిన రూ.300 కోట్లు జగన్‌కు పంపిస్తున్నారు’’ అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆదివారమిక్కడ ఆరోపించారు. వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక్కొక్కరు రూ.కోటి చొప్పున పార్టీకి డిపాజిట్‌ చేయాలని విజయసాయు ఒత్తిడి తీసుకువచ్చారని.. ఈ డబ్బులను తన మనుషుల ద్వారా ఓటర్లకు పంపిణీ చేయిస్తానని చెప్పారంటూ ఆ పార్టీ నేతలు బహిరంగంగానే అంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రగతి భారతి ట్రస్టు పేరిట విశాఖలో విజయసాయిరెడ్డి చేపట్టిన వసూళ్ల వివరాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-03-08T10:18:49+05:30 IST