కరోనా భయంతో ఆగిన గుండె
ABN , First Publish Date - 2021-05-08T09:12:35+05:30 IST
కరోనా సోకిందని తెలియగానే భయంతో ఓ వృద్ధురాలి గుండె ఆగిపోయింది. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం వెంగళపల్లెకు చెందిన సావిత్రమ్మ (70) అనారోగ్యంతో శుక్రవారం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది
చౌడేపల్లె, మే 7: కరోనా సోకిందని తెలియగానే భయంతో ఓ వృద్ధురాలి గుండె ఆగిపోయింది. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం వెంగళపల్లెకు చెందిన సావిత్రమ్మ (70) అనారోగ్యంతో శుక్రవారం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించగా పాజిటివ్గా తేలింది. ఈ విషయం తెలుసుకున్న సావిత్రమ్మ అక్కడికక్కడే కన్నుమూసింది.