ప్రభుత్వ ఆస్తుల అమ్మకం కేసు విచారణ జూన్ 18కి వాయిదా

ABN , First Publish Date - 2020-05-28T18:15:44+05:30 IST

అమరావతి: ప్రభుత్వ ఆస్తుల అమ్మకం కేసు విచారణను హైకోర్టు జూన్ 18కి వాయిదా వేసింది.

ప్రభుత్వ ఆస్తుల అమ్మకం కేసు విచారణ జూన్ 18కి వాయిదా

అమరావతి: ప్రభుత్వ ఆస్తుల అమ్మకం కేసు విచారణను హైకోర్టు జూన్ 18కి వాయిదా వేసింది. కోర్టు అనుమతి లేకుండా టెండర్లను ఖరారు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆస్తుల వేలం జూన్ 11, 12, 13 తేదీలకు వాయిదా వేసినట్టు ప్రభుత్వం తెలిపింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్ మరికొందరు న్యాయవాదులు వాదనలు వినిపించారు. జూన్ 16 వరకు కోర్టుకు సెలవులు ఉండటంతో విచారణను 18కి వాయిదా వేసింది.


Updated Date - 2020-05-28T18:15:44+05:30 IST