అమ్మవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ABN , First Publish Date - 2021-10-15T07:14:39+05:30 IST
గుంటూరులోని ఆర్.ఆగ్రహరం కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ దంపతులు
గుంటూరు, అక్టోబరు 14: గుంటూరులోని ఆర్.ఆగ్రహరం కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘనస్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం వారిని వేదపండితులు శేషవస్త్రాలతో సత్కరించి ఆశీస్సులు అంద జేశారు.