పదో తరగతి పరీక్షలపై విచారణ శనివారానికి వాయిదా
ABN , First Publish Date - 2020-06-05T20:28:58+05:30 IST
తెలంగాణలో టెన్త్ పరీక్షలపై హైకోర్టులో ఉత్కంఠ కొనసాగుతోంది. కట్టడి ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటని
హైదరాబాద్: తెలంగాణలో టెన్త్ పరీక్షలపై హైకోర్టులో ఉత్కంఠ కొనసాగుతోంది. కట్టడి ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల పరిస్థితి ఏంటని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ను హైకోర్టు ప్రశ్నించింది. సప్లిమెంటరీలో పాస్ అయితే రెగ్యులర్ విద్యార్థులుగా గుర్తిస్తారా లేదా తెలపాలన్నది. కట్టడి ప్రాంతాలు, సప్లిమెంటరీపై పూర్తి వివరాలు అందజేయాలన్నది. ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం చెబుతామని ఏజీ తెలిపారు. దీంతో టెన్త్ పరీక్షలపై తదుపరి విచారణను శనివారానికి హైకోర్టు వాయిదా వేసింది.