బల్బీర్ సింగ్ అంత్యక్రియలు పూర్తి.. భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్
ABN , First Publish Date - 2020-05-26T00:16:12+05:30 IST
హాకీ దిగ్గజం పద్మశ్రీ బల్బీర్ సింగ్ సీనియర్(96) సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో
ఛండీగఢ్: హాకీ దిగ్గజం పద్మశ్రీ బల్బీర్ సింగ్ సీనియర్(96) సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో బల్బీర్సింగ్ ఆసుపత్రి తుదిశ్వాస విడిచారు. సెక్టార్-25లో ఎలక్ట్రికల్ స్మశానంలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.
ఇక బల్బీర్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని.. పంజాబ్ క్రీడాశాఖ మంత్రి రానా గుర్మీత్ సింగ్ సోధీ డిమాండ్ చేశారు. ‘‘ఈరోజు మనం కేవలం ఓ దిగ్గజ ఆటగాడినే కాదు.. ఒక గొప్ప మార్గదర్శిని కోల్పోయాము. ఆయనకు క్రీడలు అంటే అమితమైన ఇష్టం. మాకు ఎప్పుడు సలహాకావాలన్న ఇచ్చేవారు. హాకీ ధృవతార నెలరాలింది. క్రీడా రంగానికి చెందిన ప్రతీ ఒక్కరు ఈ వార్త విని బాధపడ్డారు. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము’’ అని ఆయన అన్నారు.