శాంతా సిన్హా, అంపశయ్య నవీన్కు ‘గీతం’ గౌరవ డాక్టరేట్
ABN , First Publish Date - 2022-07-27T09:40:33+05:30 IST
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన ప్రొఫెసర్ శాంతాసిన్హా, తెలుగు నవలా రచయిత అంపశయ్య నవీన్కు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్
పటాన్చెరు రూరల్, జూలై 26: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన ప్రొఫెసర్ శాంతాసిన్హా, తెలుగు నవలా రచయిత అంపశయ్య నవీన్కు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందజేయనుంది. హైదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవం ఈ నెల 30న జరగనుంది. ఆ కార్యక్రమంలోనే శాంతాసిన్హా, నవీన్కు గౌరవ డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డీ.లిట్)ను ప్రదానం చేస్తామని వర్సిటీ అదనపు ఉపకులపతి డీఎస్ రావు మంగళవారం ప్రకటించారు. గీతం అధ్యక్షుడు భరత్, హైదరాబాద్లోని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె.నందికూరి పాల్గొంటారని తెలిపారు.