మానవత్వం చాటిన మహిళా సంఘం
ABN , First Publish Date - 2021-06-23T04:56:22+05:30 IST
15 రోజులుగా కరోనా వైరస్ బారినపడి వైద్య చికిత్సలు పొందుతున్న కొత్త గూడెం సింగరేణి రిపోర్టర్ సముద్రాల దేవకృష్ణ వైద్య ఖర్చుల కోసం రూ. ఐదువేల ఆర్థిక సహాయాన్ని ఎన్ఎఫ్ఐడబ్ల్యు భద్రాద్రి నాయకురాలు కరిశ రత్నకుమారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఆంధ్రజ్యోతి రిపోర్టర్ దేవకృష్ణ వైద్యానికి ఆర్థికసాయం
కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్, జూన్ 22 : 15 రోజులుగా కరోనా వైరస్ బారినపడి వైద్య చికిత్సలు పొందుతున్న కొత్త గూడెం సింగరేణి రిపోర్టర్ సముద్రాల దేవకృష్ణ వైద్య ఖర్చుల కోసం రూ. ఐదువేల ఆర్థిక సహాయాన్ని ఎన్ఎఫ్ఐడబ్ల్యు భద్రాద్రి నాయకురాలు కరిశ రత్నకుమారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆరోగ్యం క్షీణించి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు ఇబ్బంది పడుతున్న సమాచారం తెలుసుకొని వారు ఈ వితరణ చేశారు. కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ పద్మ, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఫహీం దాదా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నాయకులు ఖయ్యూం, నిర్మల, విజయలక్ష్మీ, పాషా, రవిచందర్ పాల్గొన్నారు.