4 నెలల క్రితమే పెళ్లయిన కొత్త జంట కాపురం ఉంటున్న ఇంట్లోంచి సడన్‌గా దుర్వాసన.. పక్కింటోళ్లకు అనుమానం వచ్చి..

ABN , First Publish Date - 2021-11-27T21:35:35+05:30 IST

ఆ కొత్తజంటకు నాలుగు నెలల క్రితమే పెళ్లైంది. వారిద్దరూ సిటీలోని ఓ గదిలో అద్దెకు ఉంటున్నారు. భర్త ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా భార్య ఇంట్లోనే ఉండేది. అయితే ఒకరోజు సడన్‌గా ఇంట్లోంచి దుర్వాసన రావడం మొదలైంది.

4 నెలల క్రితమే పెళ్లయిన కొత్త జంట కాపురం ఉంటున్న ఇంట్లోంచి సడన్‌గా దుర్వాసన.. పక్కింటోళ్లకు అనుమానం వచ్చి..

ఆ కొత్తజంటకు నాలుగు నెలల క్రితమే పెళ్లైంది. వారిద్దరూ సిటీలోని ఓ గదిలో అద్దెకు ఉంటున్నారు. భర్త ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా భార్య ఇంట్లోనే ఉండేది. అయితే ఒకరోజు సడన్‌గా ఇంట్లోంచి దుర్వాసన రావడం మొదలైంది. పక్కింటోళ్లకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూస్తే అక్కడ షాకింగ్ సీన్ కనిపించింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే..


కానుభాయ్ అలియాస్ చాకో హితేష్‌భాయ్ గోహిల్‌ అనే యువకుడికి హన్సబేన్ అనే యువతితో ఈ సంవత్సరం జులైలో వివాహం జరిగింది. అయితే ఈ కొత్త జంట సనంద్‌లోని కాపుర్‌లో నివాసముంటుంది. హితేష్ అక్కడే ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే పెళ్లైన కొద్దిరోజుల తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంట్లో జరుగుతున్న ఈ వివాదాల వల్ల హితేష్ భార్యపై ఆగ్రహం పెంచుకున్నాడు. ఆ క్రమంలోనే భార్యను దారుణంగా హత్య చేసి గదికి తాళం వేసి అతడు పారిపోయాడు.


శుక్రవారం ఉదయం ఆ ఇంట్లోంచి దుర్వాసన రావడం గమనించిన పక్కింటివాళ్లు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న వారు తాళం పగలగొట్టి ఇంట్లో చూడగా అక్కడ రక్తపుమడుగులో పడివున్న హన్సబేన్ మృతదేహం కనిపించింది. పోలీసులు బాధితురాలి భర్తకు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. హన్సబేన్ సోదరుడి ఫిర్యాధు మేరకు సనంద్ పోలీసులు హితేష్‌పై కేసు నమోదు చేశారు. హత్యకు గల కారణాలు నిందితుడిని పట్టుకున్న తర్వాతే తెలుస్తాయని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నామని వారు వెల్లడించారు.

Updated Date - 2021-11-27T21:35:35+05:30 IST