భర్తను వెతుక్కుంటూ లాడ్జికి వెళ్లిన భార్య.. అక్కడ సీన్ చూసి..
ABN , First Publish Date - 2020-10-20T02:12:09+05:30 IST
చర్ల మండలం ఆలుబాక సీఆర్పీఎఫ్ బెటాలియన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న సుభాష్కు 2017లో మణుగూరుకు చెందిన...
వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు దేహశుద్ధి
భద్రాచలం: వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త భద్రాచలంలోని ఓ ప్రైవేటు లాడ్జిలో మరో మహిళతో పట్టుబడటంతో ఇద్దరిని స్థానిక పోలీసులకు అప్పగించడంతో వారు భార్య, భర్తలకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమాచారం. చర్ల మండలం ఆలుబాక సీఆర్పీఎఫ్ బెటాలియన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్న సుభాష్కు 2017లో మణుగూరుకు చెందిన సౌజన్యతో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు.
కాగా ఏడాది కాలంగా మరొక స్త్రీతో వివాహేతర సంబంధం నడుపుతూ భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు. భార్య, పిల్లలను పట్టించుకోకుండా ఇంటికి రాకుండా మరొక మహిళతో సహ జీవనం చేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఆదివారం పట్టణంలోని ఓ లాడ్జిలో మరొక స్త్రీతో ఉన్న తన భర్త ఉన్న విషయం తెలుసుకున్న సౌజన్య ఆ లాడ్జికి వెళ్లి సుభాష్, సదరు మహిళను బయటకు తీసుకొచ్చి వారిని చితకబాది అనంతరం స్థానిక పోలీసు స్టేషన్లో అప్పగించారు. దీంతో వారికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి పంపించినట్లు సమాచారం.