హుజూరాబాద్‌ ఉపఎన్నికపై కాంగ్రెస్ కీలక అస్త్రం

ABN , First Publish Date - 2021-10-17T23:00:27+05:30 IST

హుజూరాబాద్‌ ఉపఎన్నికపై కాంగ్రెస్ కీలక అస్త్రం

హుజూరాబాద్‌ ఉపఎన్నికపై కాంగ్రెస్ కీలక అస్త్రం

హుజూరాబాద్: ఉపఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య అనుకున్నా కాంగ్రెస్ ఎంట్రీతో కొత్త ట్రయాంగిల్ ఫైట్‌గా మారింది. అయితే ఫలితంతో సంబంధం లేకుండా గట్టిగా పోరాడాలని కాంగ్రెస్ సిద్ధమైంది. గత ఎన్నికల్లో హుజూరాబాద్‌లో మంచి ఓటింగ్ సంపాదించింది.


కౌసిక్ రెడ్డికి 2018 ఎన్నికల్లో 60 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. అయితే కౌసిక్ రెడ్డిని గెలిపించడానికి టీఆర్ఎస్ సహకరించిందని డబ్బులు కూడా పంపించిందని గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చాక ఈటల రాజేందర్ ఆరోపించారు. మరి గత ఎన్నికల్లో 60 వేల ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఇప్పుడెన్ని ఓట్లు రాబట్టుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. 


హుజూరాబాద్ నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నుంచి 18 మంది డీసీసీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిని కాదని స్థానికేతరుడికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్తి బల్మూరి వెంకట్ తన స్థానికత ప్రస్థావన తెచ్చారు. ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడి పోటీ చేస్తున్నానని స్థానికత విషయం పెద్దగా లెక్కలోకి రాదని అన్నారు.


ప్రచారంలో ఎక్కువగా నిరుద్యోగాస్త్రాన్నే ఎక్కుపెట్టేందుకు ప్లాన్ చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల ట్యాగ్ లైన్‌ను కేసీఆర్ సర్కార్ విస్మరించిందని ఇదే విషయాన్ని జనంలోకి బలంగా తీసుకు వెళ్తానని చెబుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 36 వేల మంది నిరుద్యోగులు ఉన్నారని, వాళ్లే తనకు మద్దతుగా ఉంటారని బల్మూరి వెంకట్ చెబుతున్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ అందని వాళ్ల కోసం గళం విప్పుతానని అంటున్నారు. ఇలా యువతను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. 








Updated Date - 2021-10-17T23:00:27+05:30 IST